India vs Australia T20| అసీస్ తో టీ 20 మ్యాచ్ లో భారత్ టార్గెట్ 187

హోబర్ట్ వేదికగా భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ 20మ్యాచ్ లో అసీస్ తొలుత బ్యాటింగ్ చేసి 186/6 పరుగులు చేసింది. భారత్ ముందు 187పరుగుల టార్గెట్ ను పెట్టింది.

India vs Australia T20| అసీస్ తో టీ 20 మ్యాచ్ లో భారత్ టార్గెట్ 187

విధాత : హోబర్ట్ వేదికగా భారత్(India), అస్ట్రేలియా(Australia) జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ 20మ్యాచ్(3rd T20)లో అసీస్ తొలుత బ్యాటింగ్ చేసి 186/6 పరుగులు చేసింది. భారత్ ముందు 187పరుగుల టార్గెట్ ను పెట్టింది. మ్యాచ్ తో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకూమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అసీస్ ఓపెనర్లు హెడ్ 6, మిచెల్ మార్ష్ 11 పరుగులకే వెనుతిరిగారు. ఇంగ్లీస్ 1, మిచెల్ ఓవెన్ 0 పరుగులకే ఔటయ్యారు. దీంతో అసీస్ ఓ దశలో 8.3ఓవర్లలో 4వికెట్లు కోల్పోయింది. అయితే టీమ్ డెవిడ్ (74; 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్కోస్ స్టెయినిస్ (64; 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో అసీస్ ను ఆదుకున్నారు. దీంతో అస్ట్రేలియా 186పరుగులు చేయగలిగింది. మాధ్యూ షార్ట్ 26, బార్ట్ లెట్ 3పరుగులు చేశారు.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబె 1వికెట్ సాధించారు. 187పరుగుల లక్ష్య చేధనతో భారత్ బ్యాటింగ్ కొనసాగిస్తుంది. 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (25; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔట్ అయ్యాడు. నాథన్ ఎల్లిస్ వేసిన 3.3 ఓవర్‌కు వికెట్‌కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.