IRCTC Tour Package | పర్యాటకులకు ఐఆర్సీటీసీ టూరిజం శుభవార్త చెప్పింది. అరకు అందాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE’ పేరిట ప్యాకేజీని తీసుకువచ్చింది. విశాఖపట్నం నుంచి టూర్ ప్యాకేజీ ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉన్నది. ఈ ప్యాకేజీలో అరకులోని పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించనున్నారు. పర్యటన ఇలా.. ఈ నెల 25న ఉదయం విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి పర్యటన మొదలవుతుంది. రైలు అరకు […]

IRCTC Tour Package |
పర్యాటకులకు ఐఆర్సీటీసీ టూరిజం శుభవార్త చెప్పింది. అరకు అందాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE’ పేరిట ప్యాకేజీని తీసుకువచ్చింది. విశాఖపట్నం నుంచి టూర్ ప్యాకేజీ ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉన్నది. ఈ ప్యాకేజీలో అరకులోని పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించనున్నారు.
పర్యటన ఇలా..
ఈ నెల 25న ఉదయం విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి పర్యటన మొదలవుతుంది. రైలు అరకు ర్యాలీకి వెళ్తుంది. ఈ రైలు టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్లనుండగా.. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పొందనున్నారు. అరకు వ్యాలీకి చేరిన తర్వాత బస్లో ప్రయాణం ఉంటుంది.
అరకు చేరుకుతున్న తర్వాత ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్కు బయల్దేరుతారు. తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ ప్లాన్టేషన్, గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకోవడం పర్యటన ముగుస్తుంది.
ధరలు ఎలా ఉన్నాయంటే..
అరకు ఒకరోజు ప్యాకేజీ ఈసీ క్లాస్లో పెద్దలకు రూ.4,450 ఉండగా.. పిల్లలకు రూ.4,080గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్లో పెద్దలకు రూ.2,285 ఉండగా.. ఇక ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు వేర్వురు ధరలను నిర్ణయించారు. కోచ్ను బట్టి ధరలు మారనున్నాయి. వివరాల కోసం irctctourism.com వెబ్సైట్లోకి సంప్రదించాలని ఐఆర్సీటీసీ సూచించింది.
