మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్మాణానికి రూ.160 కోట్లు నిధులు మంజూరు సూర్యాపేట మెడికల్ కాలేజీ వైట్ కోట్ ఉత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి విధాత: సమాజంలో అనారోగ్యాన్ని నివారించడం ద్వారానే గణనీయమైన పురోభివృద్ధిని సాధించవచ్చని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఇదే సూత్రాన్ని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్న యజ్ఞంలో ప్రతీ వైద్య విద్యార్థి భాగస్వామ్యమై కేసీఆర్ కలలను నిజం […]

  • మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్మాణానికి రూ.160 కోట్లు నిధులు మంజూరు
  • సూర్యాపేట మెడికల్ కాలేజీ వైట్ కోట్ ఉత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: సమాజంలో అనారోగ్యాన్ని నివారించడం ద్వారానే గణనీయమైన పురోభివృద్ధిని సాధించవచ్చని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఇదే సూత్రాన్ని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్న యజ్ఞంలో ప్రతీ వైద్య విద్యార్థి భాగస్వామ్యమై కేసీఆర్ కలలను నిజం చేయాలని కోరారు.

సూర్యాపేట మెడికల్ కాలేజీలో వైట్ కోట్ ఉత్సవంలో పాల్గొన్న మంత్రి వైద్య విద్యార్థులకు వైట్ కోర్టు లు అందజేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి వైట్ కోటు వైద్య వృత్తికి చిహ్నం అని అన్నారు. విద్యార్థులు అంతా వైద్య రంగంలోకి ప్రవేశించినందుకు గుర్తుగా వైట్ కోటు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.

వైట్ కోటు వంటి వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో విద్య పట్ల గౌరవం, అంకిత భావం పెరుగుతుంద‌న్నారు. ఒకప్పుడు వైద్యానికి ఆమడ దూరంలో ఉన్న సూర్యాపేటను మెడికల్ హబ్‌గా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని కొనియాడారు.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వైద్య విద్యలో ఎంబిబిఎస్ నుండి పీజీ వరకు విద్యార్థులు సూర్యాపేటకు రావడం ఈ ప్రాంతానికి గర్వకారణం అన్నారు. కళాశాల ప్రినిపాల్ శారద విద్యార్దులకు వైట్ కోటులు ధరింప చేసి అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. తెలుపు వర్ణంతో మెరిసిపోయే కోట్లు ధరించిన విద్యార్థులు కాలేజీలో సందడి చేశారు.

నూతనంగా పీజీ విభాగంలో సీట్లు సాధించిన 8మంది విద్యార్థులకు మంత్రి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్ కళాశాల భవనాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి 160 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు.

నర్సింగ్ కాలేజీని కూడా ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్మించి మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శారద, సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated On 2 Feb 2023 12:52 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story