krithi shetty | వరుస ఫ్లాప్లు.. బేబమ్మ జోరు తగ్గడం లేదుగా..!
krithi shetty | ‘ఉప్పెన’తో సినీ రంగ ప్రవేశం చేసింది కృతిశెట్టి. బేజమ్మ పాత్రలో మెప్పించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకు ముందు రెండు చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో యూత్లో మరింత క్రేజ్ను పెంచుకున్నది. దీంతో సక్సెస్ రేట్కి తగ్గట్టుగానే పారితోషకం సైతం పెరిగింది. ఇటీవల బేబమ్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాలు సక్సెస్ను ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం నాగ […]
krithi shetty | ‘ఉప్పెన’తో సినీ రంగ ప్రవేశం చేసింది కృతిశెట్టి. బేజమ్మ పాత్రలో మెప్పించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకు ముందు రెండు చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో యూత్లో మరింత క్రేజ్ను పెంచుకున్నది. దీంతో సక్సెస్ రేట్కి తగ్గట్టుగానే పారితోషకం సైతం పెరిగింది. ఇటీవల బేబమ్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాలు సక్సెస్ను ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా ‘కస్టడీ’ చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ సినిమా సైతం చేయాల్సి ఉంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ఫిలిమ్నగర్లో టాక్.
ఈ చిత్రం కోలీవుడ్లోకి తెరంగ్రేటం చేయాలని భావించింది. ఈ ప్రాజెక్టుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిలిచిపోవడం నిరాశ కలిగించే విషయమే. బేబమ్మ జోరు తగ్గుతుందని అనుకుంటున్న సమయంలోనే మలయాళ ప్రాజెక్టును దక్కించుకోవడం విశేషం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరో వైపు విజయ్ దేవరకొండ - సమంత జోడీగా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కశ్మీర్ నేపథ్య ప్రేమకథగా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ 50శాతం పూర్తి కాగా.. సమంత అనారోగ్యం కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తున్నది. సినిమాలో రెండో నాయికకు అవకాశం ఉండగా.. కృతిశెట్టిని సంప్రదించగా ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ వార్తపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.