విధాత: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది. ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం వస్తుండగా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు […]
విధాత: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.
ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం వస్తుండగా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాథమిక విచారణకుఉ వచ్చారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తామని చెప్పారు.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. బాధితులు ఛత్తీస్గఢ్ నుంచి భద్రాలచం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారులో ఉన్న మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.