Maldives journalists |
- రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన.
విధాత: మాల్దీవుల దేశం నుంచి రాష్ట్రంలో పర్యటించేందుకు 17 మంది జర్నలిస్టుల బృందం వచ్చింది. ఈ బృందం బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ బృందం సభ్యులకు రాష్ట్ర సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి నాగుళ్ల పల్లి వెంకటేశ్వర రావు ఆహ్వానం పలికారు.
మాల్దీవుల నుంచి వచ్చిన ఈ జర్నలిస్ట్ బృందం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నది. ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించనున్నది. ఈ జర్నలిస్ట్ల బృందం తన పర్యటనలో భాగంగా భారత్ బయోటెక్, రెడ్డి ల్యాబ్స్, టీ హబ్లతో పాటు వివిధ ప్రదేశాలలో పర్యటించనున్నది.