Manchiryala విధాత :ప్రతినిధి ఆదిలాబాద్: తెలంగాణలోని మంచిర్యాల ప్రాంతానికి చెందిన న్యాయవాది సిరిపురం లావణ్య-రాజేశ్ నిర్మించిన “కుట్ర” తెలుగు సినిమా విజయవంతం కావాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ ఆకాంక్షించారు. “కుట్ర” సినిమా సంబంధిత ప్రధాన పాటను మంత్రి తన చాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సిరిపురం రాజేశ్, ఆయన టీం సభ్యులను మంత్రి అభినందించారు. దర్శకుడు సిరిపురం రాజేశ్ మాట్లాడుతూ…. కుట్ర సినిమా ఆడియో విషయంలో మధుర ఆడియో కంపెనీతో […]

Manchiryala

విధాత :ప్రతినిధి ఆదిలాబాద్: తెలంగాణలోని మంచిర్యాల ప్రాంతానికి చెందిన న్యాయవాది సిరిపురం లావణ్య-రాజేశ్ నిర్మించిన “కుట్ర” తెలుగు సినిమా విజయవంతం కావాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ ఆకాంక్షించారు.

“కుట్ర” సినిమా సంబంధిత ప్రధాన పాటను మంత్రి తన చాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సిరిపురం రాజేశ్, ఆయన టీం సభ్యులను మంత్రి అభినందించారు. దర్శకుడు సిరిపురం రాజేశ్ మాట్లాడుతూ…. కుట్ర సినిమా ఆడియో విషయంలో మధుర ఆడియో కంపెనీతో ఒప్పందం చేసుకోబోతున్నామని తెలిపారు.

అలాగే సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకొని మే చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా తారలతో కలిసి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా తాము నిర్మించిన “కుట్ర” సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు.

Updated On 5 May 2023 2:20 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story