- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
విధాత, నిజామాబాద్: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడారు.
కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ కౌన్సిల్ ఏకగ్రీవం తీర్మానం చేసినట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ నెట్టు జాహ్నవి అధ్యక్షతన జరిగింది.
సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దుపై తీర్మానం చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతున్నంత సేపు సమావేశంలోకి మీడియాను అనుమతించలేదు.