Medak సిద్దిపేట జిల్లా సామలపల్లిలో విషాదం…. నిర్లక్ష్యం… ముగ్గురి ప్రాణాలు బ‌లి విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలు బలితీస్తుంది. సరదాగా మూడు సంవత్సరాల చిన్నారి సెల్‌ఫోన్ పట్టుకుని చెరువు గట్టున ఆడుకుంటుండగా చెరువు గుంతలో జారిపడింది. అది గమనించిన బంధువులు ఇద్దరు యువకులు చిన్నారిని కాపాడే ప్రయత్నంలో చెరువులోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన […]

Medak

  • సిద్దిపేట జిల్లా సామలపల్లిలో విషాదం….
  • నిర్లక్ష్యం… ముగ్గురి ప్రాణాలు బ‌లి

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలు బలితీస్తుంది. సరదాగా మూడు సంవత్సరాల చిన్నారి సెల్‌ఫోన్ పట్టుకుని చెరువు గట్టున ఆడుకుంటుండగా చెరువు గుంతలో జారిపడింది. అది గమనించిన బంధువులు ఇద్దరు యువకులు చిన్నారిని కాపాడే ప్రయత్నంలో చెరువులోకి దిగారు.

ఈత రాకపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఖలీద్ (30) సోహెల్ (17) ముస్తఫా (04) వీరంతా కొండపాక మండలం దుద్దెడలో పుట్టినరోజు వేడుకకు బంధువులతో సహా హైదరాబాద్ నుంచి బయలుదేరారు.

మార్గమధ్యలో వర్గల్ మండలం సామలపల్లిలో బంధువుల వద్ద సాయంత్రం వరకు గడిపి పుట్టినరోజు వేడుకకు వెళ్లాల్సి ఉంది. అయితే సరదాగా గ్రామంలోని చెరువుకు వెళ్ళిన వీళ్లు చిన్నారి ముస్తఫా సెల్‌ఫోన్‌లో ఆడుకుంటు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది.

చిన్నారిని కాపాడే ప్రయత్నంలో ఖలీద్, సోహయిల్ చెరువులోకి దిగారు. వీరికి కూడా ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ముగ్గురు ప్రాణాలు వదిలారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

Updated On 4 May 2023 2:22 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story