Medak
- వడదెబ్బకు మనోరాబాద్లో మహిళ మృతి…
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ ఉమ్మడి జిల్లాలో బానుడు భగభఘ మండుతున్నాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్లో వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందారు.
ఉష్ణోగ్రతలు అధికమవడంతో జనాలు ఎవరూ రోడ్డెక్కడం లేదు. దీంతో ప్రధాన పట్టణాల్లో రోడ్లన్నీ బోసి పోయాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లడం లేదు. మెదక్ జిల్లాలో 39.8 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా లో42.7 డిగ్రీలు, సంగారెడ్డి లో41.1 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.