HomelatestMedak | రామాయంపేటపై సిద్దిపేట నేతల కుట్ర.. BRS పాలనా తీరుపై ధ్వజం: కాంగ్రెస్ నేతలు

Medak | రామాయంపేటపై సిద్దిపేట నేతల కుట్ర.. BRS పాలనా తీరుపై ధ్వజం: కాంగ్రెస్ నేతలు

Medak

  • అన్నీ వనరులున్నా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు దక్కని మోక్షం….
  • రిలే నిరాహార దీక్షలకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
  • పీసీసీ ప్రతినిధులు చౌదరి సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంపై సిద్దిపేట నేతలు కుట్ర చేసి అభివృద్దిని అడ్డుకుంటున్నారని పరోక్షంగా మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఒకప్పుడు సీఎం అంజయ్య ప్రాతినిథ్యం వహించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామాయంపేటను అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని వారు ఘాటుగా వ్యాఖ్యానించారు.

వనరులున్నా రామాయంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా గుర్తించడం లేదని తెలంగాణ‌ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిథులు చౌదరి సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ ధ్వజమెత్తారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ జరుగుతున్న రిలే నిరాహాల దీక్ష శిబిరానికి కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ అభివృద్ది కుంటు పడిందని, ఇక్కడ ఏర్పాటు కావాల్సిన కార్యాలయాలు, సంస్థలు సిద్దిపేటకు తరలి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్దిపేట దొరల చేతిలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బందీ అయ్యిందన్నారు. మెదక్ అభివృద్ది తిరగోమన దశలో ఉందన్నారు. ఒకనాడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన రామాయంపేట ఉనికిని ప్రస్తుత పాలకులు ప్రశ్నార్థకం చేశారన్నారు. రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ప్రక్రియలో తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రామాయంపేట ప్రజల న్యాయమైన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మద్దతు తెలుపుతుందన్నారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షా వేదిక వద్దకు వెళ్లి సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు.

కార్యక్రమంలో పిసిసి సభ్యులు సుప్రభాత రావు, పీసీసీ సభ్యులు మేడం బాలకృష్ణ, రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి, చిన్న శంకరంపేట్ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపిటిసి ఫోరమ్ల అధ్యక్షుడు శివకుమార్, ఎంపీటీసీలు ప్రసాద్ గౌడ్ , నాగులు స్వామి, నార్సింగ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ మాజీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రొయ్యల పోచయ్య, రామాయంపేట మాజీ పట్టణ అధ్యక్షుడు దాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ రామాయంపేట పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటేష్, ఎస్సీ సెల్ బోట్ల బాబు, సీనియర్ నాయకులు దోమకొండ యాదగిరి కుమార్, సాగర్ వెంకట, గుడాల లింగం, మోతుకు రాజు, మడూరి నవీన్, పర్వతాపూర్ చందర్, కాంగ్రెస్ యువ నాయకులు ధర్మారం శ్రీకాంత్ రెడ్డి, రెడ్డమైన నరేష్, దాకి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular