Minister Harish Rao | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాళేశ్వ‌రం కంటే ముందు ప్రారంభ‌మైన పోల‌వరం ప్రాజెక్టు ఇప్ప‌టికీ పూర్తి కాలేద‌న్నారు. ఇంకో ఐదేండ్లు అయినా పోల‌వ‌రం పూర్తి కాద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. చిన్న‌కోడూరు వ్య‌వ‌సాయ మార్కెట్ పాల‌కవ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారానికి హ‌రీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌పై అక్క‌డి ఇంజినీర్ల‌తో మాట్లాడాన‌ని తెలిపారు. మ‌రో ఐదేండ్ల‌లో పూర్త‌యితే గొప్పేన‌ని […]

Minister Harish Rao | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాళేశ్వ‌రం కంటే ముందు ప్రారంభ‌మైన పోల‌వరం ప్రాజెక్టు ఇప్ప‌టికీ పూర్తి కాలేద‌న్నారు. ఇంకో ఐదేండ్లు అయినా పోల‌వ‌రం పూర్తి కాద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. చిన్న‌కోడూరు వ్య‌వ‌సాయ మార్కెట్ పాల‌కవ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారానికి హ‌రీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌పై అక్క‌డి ఇంజినీర్ల‌తో మాట్లాడాన‌ని తెలిపారు. మ‌రో ఐదేండ్ల‌లో పూర్త‌యితే గొప్పేన‌ని అక్క‌డి ఇంజినీర్లు చెప్పిన‌ట్లు హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు. మ‌న కాళేశ్వ‌రం ప్రాజెక్టును త‌క్కువ కాలంలోనే పూర్తి చేసుకున్నాం. ఆ ఫ‌లితాలు అందుతున్నాయ‌న్నారు. పోలవ‌రం పూర్తి కాలేదు.. ఆ ఫ‌లితం అంద‌లేద‌న్నారు. కాళేశ్వరం గురించి ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అబద్ధాలను తిప్పికొట్టాలి అని హరీశ్‌రావు పార్టీ శ్రేణుల‌కు, రైతుల‌కు పిలుపునిచ్చారు.

Updated On 13 Nov 2022 1:08 PM GMT
subbareddy

subbareddy

Next Story