విధాత: అమెరికా డల్హాస్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణంచిన ఐశ్వర్య రెడ్డి మృతదేహానికి మంత్రి జి.జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగదీష్ రెడ్డితో పాటు శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డిలు కూడా నివాళలర్పించారు. డల్హాస్లో ఉన్నత విద్యానభ్యసిస్తున్న కుమారి ఐశ్వర్య రెడ్డి ఆచూకీ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకురాగా తక్షణం స్పందించి అమెరికా కాన్సులేట్తో సంప్రదింపులు జరిపారు. ఆచూకీ […]
విధాత: అమెరికా డల్హాస్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణంచిన ఐశ్వర్య రెడ్డి మృతదేహానికి మంత్రి జి.జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగదీష్ రెడ్డితో పాటు శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డిలు కూడా నివాళలర్పించారు.
డల్హాస్లో ఉన్నత విద్యానభ్యసిస్తున్న కుమారి ఐశ్వర్య రెడ్డి ఆచూకీ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకురాగా తక్షణం స్పందించి అమెరికా కాన్సులేట్తో సంప్రదింపులు జరిపారు. ఆచూకీ తెలుసుకొనడంతో పాటు జరిగిన ఘోరం తెలియడంతో నిశ్చేష్టులైన మంత్రి జగదీష్ రెడ్డి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు చేపట్టిన విషయం విదితమే.
ఈ క్రమంలోనే గురువారం నగరానికి చేరుకున్న ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ ,శానంపూడి సైదిరెడ్డి లతో కలసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఐశ్వర్య మృతి దేహాన్ని ఆమె స్వస్థలం నేరడచర్లకు అంత్యక్రియలు నిమిత్తం తరలించారు.