9 ఏండ్ల కూతురిపై తండ్రి ఘాతుకం.. 2 నెలల నుంచి అత్యాచారం
Maharashtra | కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురిపై కన్నేశాడు. ఓ క్రూర మృగంలా ప్రవర్తించాడు. సమయం దొరికినప్పుడల్లా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. భార్య పక్కలో ఉండగానే, కూతురిపై అత్యాచారానికి యత్నించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్కు చెందిన ఓ 30 ఏండ్ల వ్యక్తి తన భార్య, కూతురు(9)తో కలిసి నాగ్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలోని కమలేశ్వర్ టౌన్లో నివాసముంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ […]
Maharashtra | కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురిపై కన్నేశాడు. ఓ క్రూర మృగంలా ప్రవర్తించాడు. సమయం దొరికినప్పుడల్లా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. భార్య పక్కలో ఉండగానే, కూతురిపై అత్యాచారానికి యత్నించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్కు చెందిన ఓ 30 ఏండ్ల వ్యక్తి తన భార్య, కూతురు(9)తో కలిసి నాగ్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలోని కమలేశ్వర్ టౌన్లో నివాసముంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే సదరు వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు.
ఈ క్రమంలోనే కూతుర్ని టార్గెట్ చేశాడు. భార్య లేని సమయంలో తన కూతురిపై విరుచుకుపడే వాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలి బయటకు చెప్పలేదు. రెండు నెలల నుంచి సమయం దొరికినప్పుడల్లా కూతురిపై అత్యాచారం చేసేవాడు.
అయితే సోమవారం రాత్రి సమయంలో భార్య పక్కలో ఉండగానే, కూతురిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. విషయాన్ని పసిగట్టిన భార్య అప్రమత్తమైంది. భర్తను మందలించింది. ఆ తర్వాత కమలేశ్వర్ పోలీసులకు భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.