విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. సీవీ ఆనంద్ నేతృత్వంలో వేసిన సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని తెలియజేసింది. మీడియాకు, రాజకీయ నాయకులకు దర్యాప్తు వివరాలు వెల్లడించవద్దని ఆదేశించింది. ఈ నెల 29న దర్యాప్తు పురోగతి నివేదికను కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి విదితమే.

విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
సీవీ ఆనంద్ నేతృత్వంలో వేసిన సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని తెలియజేసింది. మీడియాకు, రాజకీయ నాయకులకు దర్యాప్తు వివరాలు వెల్లడించవద్దని ఆదేశించింది.
ఈ నెల 29న దర్యాప్తు పురోగతి నివేదికను కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి విదితమే.
