Saturday, April 1, 2023
More
    Homelatestడాక్టర్ ప్రీతి మృతి వార్తతో దిగ్భ్రాంతికి లోన‌య్యా: ఎమ్మెల్సీ క‌విత‌ లేఖ

    డాక్టర్ ప్రీతి మృతి వార్తతో దిగ్భ్రాంతికి లోన‌య్యా: ఎమ్మెల్సీ క‌విత‌ లేఖ

    విధాత‌: సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని అని క‌విత తెలిపారు. ఈ సందర్భంగా ప్రీతి త‌ల్లిదండ్రుల‌కు క‌విత లేఖ రాశారు.

    ఒక ఉత్త‌మ వైద్యురాలిని స‌మాజం కోల్పోయింది

    ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నాను. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది.

    అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను అని క‌విత త‌న లేఖ‌లో పేర్కొన్నారు. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది అని ఆమె అన్నారు.

    మీ కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

    మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదు అని మీకు హామీ ఇస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని క‌విత స్ప‌ష్టం చేశారు.

    యావత్తు రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని క‌విత త‌న లేఖ‌ను ముగించారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular