HomelatestNalgonda | కారు బస్సు ఢీ.. ఒకరి మృతి

Nalgonda | కారు బస్సు ఢీ.. ఒకరి మృతి

Nalgonda

విధాత: నల్గొండ జిల్లా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద కారు ఆర్టీసీ బస్సు ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో పాటు మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular