Nizamabad | విధాత: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న రెండు బైక్‌లను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లి కూతురుతో పాటుగా మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి డిచ్పల్లి ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రూరల్ మండలంలోని గూపన్‌పల్లికి చెందిన రాజన్న (55), పని నిమిత్తం డిచ్పల్లి నుంచి శుద్ధపల్లి సీఎంసీ మీదుగా నిజామాబాద్‌కు తన బైక్‌పై వస్తున్నాడు. మరో బైక్‌పై […]

Nizamabad |

విధాత: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న రెండు బైక్‌లను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లి కూతురుతో పాటుగా మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి డిచ్పల్లి ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రూరల్ మండలంలోని గూపన్‌పల్లికి చెందిన రాజన్న (55), పని నిమిత్తం డిచ్పల్లి నుంచి శుద్ధపల్లి సీఎంసీ మీదుగా నిజామాబాద్‌కు తన బైక్‌పై వస్తున్నాడు. మరో బైక్‌పై మోపాల్ మండలం, కులాస్పూర్‌కు చెందిన శ్యామ్ (35) అతని భార్య నవ్య(32) కూతురు సమన్వయి(7), కొడుకు ఋషితో కలిసి డిచ్పల్లి నుంచి కులస్పూర్‌కు తమ బైక్‌పై వెళ్తున్నారు. సీఎంసీ వద్ద గల 44వ జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన కంటైనర్ లారీ రెండు బైకులను వెనుక నుంచి ఢీ కొట్టింది.

ఈ ఘటనలో రాజన్న అక్కడికక్కడే మృతి చెందగా, నవ్య, ఆమె కూతురు సమన్వయి, నవ్య భర్త రాజు, మరియు కొడుకు ఋషి గాయాలపాలయ్యారు. వీరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నవ్య, ఆమె కూతురు సమన్వయి మృతి చెందారు.

నవ్య భర్త శ్యామ్, కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న డిచ్పల్లి పోలీసులు మృతదేహాలను పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Updated On 10 May 2023 9:16 AM GMT
Somu

Somu

Next Story