Kangana Ranaut | కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్గా కంగనా ఉంటారు. ఆమె సినీ పరిశ్రమకి సంబంధించిన వారినే కాక రాజకీయాలకి సంబంధించిన వారిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. ఈ అమ్మడికి సినిమాల కన్నా కూడా కాంట్రవర్సీస్తోనే ఎక్కువ పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చంద్రముఖి 2అనే చిత్రం చేస్తుంది. రజనీకాంత్, నయనతార ప్రధానపాత్రలలో వచ్చిన చంద్రముఖికి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందుతుంది. పి వాసు సీక్వెల్ తెరకెక్కించగా, ఇందులో రాఘవా లారెన్స్ […]
Kangana Ranaut |
కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్గా కంగనా ఉంటారు. ఆమె సినీ పరిశ్రమకి సంబంధించిన వారినే కాక రాజకీయాలకి సంబంధించిన వారిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. ఈ అమ్మడికి సినిమాల కన్నా కూడా కాంట్రవర్సీస్తోనే ఎక్కువ పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చంద్రముఖి 2అనే చిత్రం చేస్తుంది.
రజనీకాంత్, నయనతార ప్రధానపాత్రలలో వచ్చిన చంద్రముఖికి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందుతుంది. పి వాసు సీక్వెల్ తెరకెక్కించగా, ఇందులో రాఘవా లారెన్స్ ప్రధాన పాత్రని పోషించారు. చంద్రముఖి పాత్రను కంగనా పోషిస్తున్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. చెన్నైలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల ప్రస్తావన రాగా, దానికి స్పందించిన కంగనా రనౌత్.. భారత్ అంశం గురించి రెండేళ్ల క్రితమే ప్రస్తావించానని గుర్తు చేశారు.
రాజకీయాల్లో అవకాశము వస్తే తాను వదులుకునే ప్రసక్తే లేదని , పేదలకు తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఏపీ పర్యాటకశాఖ మంత్రి, నటి రోజా చేసిన వ్యాఖ్యలను విలేకరులు కంగనా దగ్గర ప్రస్తావించగా, ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది
కంగనా మాట్లాడుతూ.. రోజా అంటే ఎవరు? అలాంటి వారు ఉన్నారన్న విషయమే నాకు తెలియదు. ఆమె గురించి నేనేం మాట్లాడతానంటూ కంగనా షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కంగనా చేసిన కామెంట్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుండగా, దీనిపై రోజా ఏమైన స్పందిస్తా అనేది చూడాలి.
గత కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయం జోరుగా నడుస్తుంది. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కంగనా… రోజా గురించి చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది.