Parliament Session | న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ 18-22 తేదీల్లో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చనున్నారు. 17వ లోక్‌సభ 13వ సెషన్‌, రాజ్యసభ 261వ సెషన్‌ ఈ తేదీల్లో ఐదు సిటింగ్‌లు నిర్వహిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అమృత్‌కాల్‌లో పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం ఎదురుచూస్తున్నాను.. అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే, ఏ ఉద్దేశాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదు. నిజానికి గత సమావేశాల్లో ప్రభుత్వం అన్ని బిల్లులనూ ఆమోదించుకున్న […]

Parliament Session | న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ 18-22 తేదీల్లో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చనున్నారు. 17వ లోక్‌సభ 13వ సెషన్‌, రాజ్యసభ 261వ సెషన్‌ ఈ తేదీల్లో ఐదు సిటింగ్‌లు నిర్వహిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అమృత్‌కాల్‌లో పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం ఎదురుచూస్తున్నాను.. అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అయితే, ఏ ఉద్దేశాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదు. నిజానికి గత సమావేశాల్లో ప్రభుత్వం అన్ని బిల్లులనూ ఆమోదించుకున్న తర్వాతే అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టింది. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టిన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఇటీవల మూడు రోజులపాటు దానిపై చర్చలు జరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఐదు రోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది

Updated On 31 Aug 2023 10:00 AM GMT
somu

somu

Next Story