Saturday, April 1, 2023
More
    HomelatestPM Kisan | రైతులకు గుడ్‌న్యూస్‌.. మరికొద్దిసేపట్లోకి ఖాతాల్లోకి కిసాన్‌ యోజన డబ్బులు..!

    PM Kisan | రైతులకు గుడ్‌న్యూస్‌.. మరికొద్దిసేపట్లోకి ఖాతాల్లోకి కిసాన్‌ యోజన డబ్బులు..!

    PM Kisan | రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన 13వ విడుత నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు. శివమొగ్గ, బెక్లగావి జిల్లాల్లో పర్యటించనున్నారు.

    ఆయా జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద రూ.2,500 కోట్ల విలువైన నీటి సరఫరా ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ యోజన నిధులను సైతం విడుదలను ప్రారంభించనున్నారు.

    రూ.16,800కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు 8కోట్ల మంది రైతులకు పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా హాజరుకానున్నారు.

    ఈ పథకం కింద 11, 12వ విడుతల్లో గతేడాది మే, అక్టోబర్‌లో నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్రం ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున ఖాతాల్లో జమ చేస్తున్నది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular