PM Modi | ఇండియా-భారత్‌పై మాట్లాడొద్దని సూచన న్యూఢిల్లీ: సనాతన ధర్మ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై స‌మాజం నుంచి సరైన స్పందన రావాలని అన్నారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించడం సనాతన ధర్మాన్ని పాటించే వారి వివక్షకు ఉదాహరణగా ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్న ఒక రోజు తర్వాత ప్ర‌ధాని మోదీ స్పందించారు. అదే సమయంలో ఇండియా-భారత్‌ వివాదంలో […]

PM Modi |

  • ఇండియా-భారత్‌పై మాట్లాడొద్దని సూచన

న్యూఢిల్లీ: సనాతన ధర్మ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై స‌మాజం నుంచి సరైన స్పందన రావాలని అన్నారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించడం సనాతన ధర్మాన్ని పాటించే వారి వివక్షకు ఉదాహరణగా ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్న ఒక రోజు తర్వాత ప్ర‌ధాని మోదీ స్పందించారు. అదే సమయంలో ఇండియా-భారత్‌ వివాదంలో కూడా మంత్రులు వ్యాఖ్యానాలు చేయవద్దని ఆదేశించారని సమాచారం.

ఈ విషయంలో బాధ్యులు మాత్రమే పార్టీ తరఫున అభిప్రాయాలు చెబుతారని స్పష్టం చేశారు. బుధవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని సమాచారం. సనాతన ధర్మం రోగంతో సమానమని, దానిని నిర్మూలించాల్సిందేనన్న త‌న వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, క్షమాపణలు చెప్పేందుకు ఉద‌య‌నిధి నిరాకరించారు. తన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా ఎదుర్కోవ‌డానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉద‌య‌నిధి చెప్పారు. ఉద‌య‌నిధిపై చర్యలు తీసుకునేందుకు తమిళనాడు గవర్నర్ అనుమతి పొందేందుకు బీజేపీ నేత‌లు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవ‌ల ప్రోగ్రేసివ్ రైట‌ర్స్ స‌మావేశంలో పాల్గొన్న‌ ఉదయనిధి స్టాలిన్ "సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని, మ‌నుషుల మ‌ధ్య అస‌మాన‌త‌లు పెంచే స‌నాత‌న ధ‌ర్మాన్నినిర్మూలించాల‌ని మాట్లాడారు. ఇది తీవ్ర దుమారాన్ని రేపింది. ఉద‌య‌నిధి వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇది "జాతి నిర్మూలనకు పిలుపు"తో సమానమని బీజేపీ వాదిస్తోంది. అయితే డిఎంకే నాయకులు మాత్రం బీజేపీ విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తున్నారు.

ఇండియా కూట‌మిలోని రాజ‌కీయ పార్టీల‌ను కూడా ఈ వ్యాఖ్య‌లు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశాయి. అన్ని మతాలను గౌరవించాలని, అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రజలకు ఎప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై వినూత్న వైఖరిని అవలంబించింది. ప్రియాంక్ ఖర్గే, కార్తీ చిదంబరం వంటి కాంగ్రెస్ యువ నేతలు స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధికే మద్దతు పలికారు. సీపీఐ పార్టీకి చెందిన డి.రాజా కూడా స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన వ్యాఖ్య‌లు స‌రైన‌వే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించ‌డం లేద‌న్నాయి.

Updated On 6 Sep 2023 1:05 PM GMT
somu

somu

Next Story