విధాత‌: ప్రధాని మోడీపై పాకిస్థాన్‌ మీడియా ప్రశంసలు కురిపించింది. మోడీ నేతృత్వంలోనే భారత్‌కు అంతర్జాతీయ ప్రాధాన్యం పెరుగుతున్నదని వ్యాఖ్యానించింది. ఆయన హయాంలో భారత్‌ అంతర్జాతీయంగా పలుకుబడి పెంచుకుంటున్నదని ఒక ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ప్రభావం చూపడానికి కారణం మోడీ బలమైన నాయకత్వమే అని ప్రశంసించింది. పెట్టుబడులకు భారత్‌ను స్వర్గధామంగా తీర్చిదిద్దారని, మలిచారని ప్రముఖ విశ్లేషకుడు షెహ్‌జాద్‌ ఛౌద్రి ప్రముఖ పత్రిక ది ట్రూబ్యూన్‌ కు రాసిన‌ వ్యాసంలో పేర్కొన్నారు. ఎంతో నైపుణ్యంతో విదేశీ […]

విధాత‌: ప్రధాని మోడీపై పాకిస్థాన్‌ మీడియా ప్రశంసలు కురిపించింది. మోడీ నేతృత్వంలోనే భారత్‌కు అంతర్జాతీయ ప్రాధాన్యం పెరుగుతున్నదని వ్యాఖ్యానించింది. ఆయన హయాంలో భారత్‌ అంతర్జాతీయంగా పలుకుబడి పెంచుకుంటున్నదని ఒక ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది.

అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ప్రభావం చూపడానికి కారణం మోడీ బలమైన నాయకత్వమే అని ప్రశంసించింది. పెట్టుబడులకు భారత్‌ను స్వర్గధామంగా తీర్చిదిద్దారని, మలిచారని ప్రముఖ విశ్లేషకుడు షెహ్‌జాద్‌ ఛౌద్రి ప్రముఖ పత్రిక ది ట్రూబ్యూన్‌ కు రాసిన‌ వ్యాసంలో పేర్కొన్నారు.

ఎంతో నైపుణ్యంతో విదేశీ విధానాన్ని కొనసాగిస్తున్నారని తద్వారా దేశ జీడీపీ మూడు బిలియన్ల డాలర్లకు పెరిగిందని అన్నారు. ప్రతికూల సమయాల్లోనూ భారత్‌ పాలనా వ్యవస్థను తట్టుకుని నిలిచిందన్నారు.

తద్వారా బలమైన ప్రజాస్వామ్య దేశమని నిరూపించుకున్నదని ఉద్ఘాటించారు. భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో గతంలో ఎవ్వరూ చేయని పనిని ప్రధాని మోడీ చేశారని ప్రశంసించారు

Updated On 16 Jan 2023 4:41 PM GMT
krs

krs

Next Story