విధాత, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సైబరాబాద్‌ పోలీసలు హైకోర్టు ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ కోర్టు జడ్జి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ముగ్గురు నిందితుల రిమాండ్‌ను జడ్జి తిరస్కరించడాన్ని పిటిషన్‌లో వెల్లడించారు. అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. అయితే, ఆ పిటిషన్ ను కోర్టు అత్యవసర విచారణకు నిరాకరించింది. సాధారణ పిటిషన్ వేయాలని, దాన్ని రేపు విచారణ చేస్తామని స్పష్టం చేసింది. టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, […]

విధాత, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సైబరాబాద్‌ పోలీసలు హైకోర్టు ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ కోర్టు జడ్జి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ముగ్గురు నిందితుల రిమాండ్‌ను జడ్జి తిరస్కరించడాన్ని పిటిషన్‌లో వెల్లడించారు. అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు.

అయితే, ఆ పిటిషన్ ను కోర్టు అత్యవసర విచారణకు నిరాకరించింది. సాధారణ పిటిషన్ వేయాలని, దాన్ని రేపు విచారణ చేస్తామని స్పష్టం చేసింది. టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, కొనేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఏసీబీ కోర్టు నిందితులకు రిమాండ్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Updated On 28 Oct 2022 8:20 AM GMT
Somu

Somu

Next Story