ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ల హర్షం గతంలో ఇచ్చిన హామీ మేరకు డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పిoచిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షు చంద్ర మోహన్, ప్రధాన […]

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

డిప్యూటీ కలెక్టర్ల హర్షం

గతంలో ఇచ్చిన హామీ మేరకు డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పిoచిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షు చంద్ర మోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి భాస్కర్ రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అలాగే అర్హులైన తహసీల్దార్లకు వెంటనే డిప్యూటీ కలెక్టర్లు గా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.

పదోన్నతులు పొందింది వీరే..

ఆర్‌డీ మాధురి
బీ రోహిత్ సింగ్
ఏ పద్మశ్రీ
గుగులోత్ లింగ్యా నాయక్
మహ్మద్ అసదుల్లా
కేవీవీ రవి కుమార్
డీ రాజ్యలక్ష్మి
కనకం స్వర్ణలత
జీ వెంకటేశ్వర్లు
వీ భుజంగ రావు
డీ వెంకట మాధవ రావు
ఎం వెంకట్ భూపాల్ రెడ్డి
చీరాల శ్రీనివాసులు
ఎస్ తిరుపతి రావు
చీమలపాటి మహేందర్ జీ
కే గంగాధర్
బసుట్కర్ కృష్ణారావు
సల్వేరు సూరజ్ కుమార్
ఈ వెంకటచారి
వి విక్టర్
ఎల్ కిశోర్ కుమార్
పీ అశోక్ కుమార్
ఎం విజయలక్ష్మీ
జే శ్రీనివాస్
డీ విజేందర్ రెడ్డి
కే శ్యామల దేవీ
కే వీర బ్రహ్మచారి
జేఎల్బీ హరిప్రియ
కే లక్ష్మీ కిరణ్
డీ వేణు
టీఎల్ సంగీత.

స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతుల పట్ల ట్రెసా హర్షం

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తున్న 31 మంది ఆర్డీవోలు /రెవెన్యూ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీవో 308 జారీ చేయడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్( ట్రెసా ) ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేసింది.

ఈ సందర్బంగా ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూలో పదోన్నతులపై అనేక మార్లు ట్రెసా తరపున ప్రభుత్వానికి విన్నపం చేశామని, ముఖ్యమంత్రి హామీ మేరకు స్పెషల్ గ్రేడ్ పదోన్నతులు కల్పించడం సంతోషకరమని తెలిపారు. త్వరలో తహసీల్దార్లకు కూడా డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి ట్రెసా విజ్ఞప్తి చేసింది.

Updated On 23 Sep 2022 3:07 PM GMT
krs

krs

Next Story