విధాత: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు సాన తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. తన తర్వాతి చిత్రాన్ని తారక్ తో చేయాలని అనుకున్నారు. దీనికి తారక్ కూడా ఓకే చెప్పారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్‌-కొర‌టాల శివ‌ల చిత్రం వ‌ల్ల ఆల‌స్యం ఆలస్యం అవుతుందని భావించారు. ఇప్పటికే తన కోసం రెండేళ్లు బుచ్చిబాబు వెయిట్ చేస్తున్న సంగతి గమనించిన ఎన్టీఆర్ స్వయంగా ఈ స్క్రిప్టును రామ్ చరణ్ కి […]

విధాత: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు సాన తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. తన తర్వాతి చిత్రాన్ని తారక్ తో చేయాలని అనుకున్నారు. దీనికి తారక్ కూడా ఓకే చెప్పారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్‌-కొర‌టాల శివ‌ల చిత్రం వ‌ల్ల ఆల‌స్యం ఆలస్యం అవుతుందని భావించారు.

ఇప్పటికే తన కోసం రెండేళ్లు బుచ్చిబాబు వెయిట్ చేస్తున్న సంగతి గమనించిన ఎన్టీఆర్ స్వయంగా ఈ స్క్రిప్టును రామ్ చరణ్ కి వినిపించమని చెప్పారు. రామ్ చరణ్ కి స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నాడు బుచ్చిబాబు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాత‌గా ఆర్సీ 15 చిత్రం చేస్తున్నారు.

శంకర్ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ తాజా చిత్రం అంటే ఆర్సి 16 బుచ్చిబాబుతో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో బుచ్చిబాబు ఉన్నారు. ఈ మూవీలో మరోసారి ఆయన రామ్ చరణ్ కోసం ప్రతి నాయకుడిగా మరల విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్తో భారీ తారాగాణంతో ఈ సినిమాను బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు. అన్ని భాషల నుంచి నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా చిత్రం కాబట్టి ఆ మాత్రం ముందుచూపు తప్పనిసరి.

ఇక ఉప్పెన సక్సెస్‌లో కీలక భాగస్వామి అయినా విజయ్ సేతుపతిని ఈ మూవీకి కూడా తీసుకుంటే కోలీవుడ్ లో కూడా మ‌రోసారి బ‌జ్ క్రియేట్ అయి ఈ చిత్రానికి హైప్ వ‌స్తుంద‌ని బుచ్చిబాబు భావిస్తున్నారు. మరి విజయ్ సేతుపతి ఈ సినిమాకు ఓకే చెబుతారా లేదా అనేది వేచి చూడాలి..!

Updated On 30 Jan 2023 1:47 PM GMT
krs

krs

Next Story