Revanth Reddy | కామారెడ్డి జిల్లా( kamareddy ) పిట్లం సభలో 50 ఏళ్లలో కాంగ్రెస్( Congress ) ఏమీ చేసిందని కేటీఆర్( KTR ) చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్‌( Nizamabad )లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చలువే అన్నారు. రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు, వెయ్యి జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీకాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్, కేటీఆర్ చదువుకున్న పాఠశాలలు నిర్మించింది కూడా […]

Revanth Reddy | కామారెడ్డి జిల్లా( kamareddy ) పిట్లం సభలో 50 ఏళ్లలో కాంగ్రెస్( Congress ) ఏమీ చేసిందని కేటీఆర్( KTR ) చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్‌( Nizamabad )లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చలువే అన్నారు. రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు, వెయ్యి జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీకాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్, కేటీఆర్ చదువుకున్న పాఠశాలలు నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీనే.

మేం తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్( KCR ) సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు. 24 గంటల కరెంటు( 24 Hours Current ) ఈ ప్రభుత్వం ఇస్తుందని నిరూపిస్తే..దేనికైనా సిద్ధం. మీరేం చేశారో.. మేమేం చేశామో మీడియా మిత్రుల సమక్షంలో చర్చకు సిద్ధమా? అని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. మేం ఏమేం చేశామో నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టమీదైనా.. ఇంకెక్కడైనా మాట్లాడేందుకు సిద్ధం. బీఆర్ఎస్ చేసింది.. 3 వేల వైన్ షాపులు..60 వేల బెల్ట్ షాపులు పెట్టడం మాత్రమే. అంతకు మించి రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Updated On 15 March 2023 5:31 PM GMT
subbareddy

subbareddy

Next Story