అమ‌రుల గురించి మాట్లాడే హ‌క్కు కూడా లేదు.. త‌రిమికొట్టే రోజులు దగ్గ‌ర్లోనే: ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌రావు విధాత: సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిన్న బాల్కొండలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, అసలు ఆయనది పాదయాత్ర కాదని, కాంగ్రెస్‌కు పాడే గట్టే యాత్ర అని విమర్శించారు. […]

  • అమ‌రుల గురించి మాట్లాడే హ‌క్కు కూడా లేదు..
  • త‌రిమికొట్టే రోజులు దగ్గ‌ర్లోనే: ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌రావు

విధాత: సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిన్న బాల్కొండలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, అసలు ఆయనది పాదయాత్ర కాదని, కాంగ్రెస్‌కు పాడే గట్టే యాత్ర అని విమర్శించారు.

రేవంత్ ఆరోప‌ణ‌లు స‌రికాదు..

రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడి ఎమ్మెల్యేలను తిడుతున్నారని, ఆయన వృత్తి బ్లాక్ మెయిలింగ్ అని, రేవంత్ ఒక రాజకీయ వ్యభిచారి, ఓ బ్రోకర్ అంటు దుయ్యబట్టారు. సచివాలయం, అమర వీరుల స్మారక కేంద్రం, బీఆర్.అంబెడ్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి అంటూ ఆధారాలు లేకుండా రేవంత్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సమాచార హక్కు చట్టాన్ని బ్లాక్ మెయిలింగ్‌కు వాడుకునే రేవంత్ ఇపుడు కూడా వీటిపై సమాచారం తీసుకోవచ్చన్నారు. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు ఎక్కడిదన్నారు.

జీఎస్టీ వ‌ల్లే పెరిగిన స‌చివాల‌య నిర్మాణ ఖ‌ర్చు

తెలంగాణ అమరవీరుల మరణాలకు కారణం రేవంతే కదా అని ఆరోపించారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు సంకలో జొర్రి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన రేవంత్‌కు ఇన్ని ఆస్తులు ఎక్కడివని ప్ర‌శ్నించారు.

సచివాలయం నిర్మాణం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం నిర్మాణ వ్యయం పెరగడానికి జీఎస్టీ రేట్లు 6 శాతం నుంచి 18శాతం పెరిగాయని, స్టీలు, సిమెంటు రేట్లు పెరిగాయని అందుకే అంచనా వ్యయాలు పెరిగాయన్నారు. ఇప్పటివరకు సచివాలయానికి 470 కోట్లు ఖర్చు జరిగిందన్నారు.

పొలిటికల్‌ బ్రోక‌ర్ రేవంత్‌..

కేసీఆర్ పాలనలో అవినీతికి చోటే లేదన్నారు. రాహుల్ గాంధీతో, మల్లికార్జున ఖర్గేతో ఎపుడైనా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పింపచేయలేని, రేవంత్ అమరవీరుల స్మారక కేంద్రం నిర్మాణపై మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.

అవినీతి అంటూ పిచ్చి ప్రేలాపనులు చేస్తే తన్ని తరిమేస్తారన్నారు. కమీషన్లు రేవంత్ కు, కాంగ్రెస్ కు అలవాటు అని, తమ లాగానే అందరూ అవినీతి చేస్తారని రేవంత్ అనుకుంటున్నారన్నారు. రేవంత్ ను మించిన పొలిటికల్ బ్రోకర్ ఎవ్వరూ లేరన్నారు.

రేవంత్‌కు చిప్ప‌కూడే గ‌తి: ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌రావు

ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యింద న్నారు. దేశానికి ఎవ్వరు వచ్చినా తెలంగాణనే ముందు సందర్శిస్తున్నారన్నారు. అమర వీరుల ఆత్మలు స్మారక కేంద్రంపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఘోషిస్తున్నాయన్నారు. ప్రశాంత్ రెడ్డి కాలి గోటికి కూడా రేవంత్ సరిపోరన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా ఉండి బుద్ది జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

రేవంత్ ఓటుకు నోటుకు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డారని, రాబోయే రోజుల్లో రేవంత్ కు జైలులో చిప్ప కూడే గతి అన్నారు. ప్రశాంత్ రెడ్డి కి రేవంత్ కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిని అవినీతిపరుడని రేవంత్ ఆరోపించడం తగదన్నారు. రేవంత్ ఉండేందుకు జైలే అనువైన స్థానమని, ప్రజా క్షేత్రం కాదన్నారు. రేవంత్ ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

Updated On 14 March 2023 12:56 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story