RTC strike case కోర్టుకు హాజరైన ప్రజా సంఘాల నేతలు, కార్మికులు విధాత: 2019 అక్టోబర్ లో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సుమారు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన క్రమంలో వారికి అండగా నిలబడిన అనేకమంది ప్రజాసంఘాల నాయకులపై, ప్రతిపక్ష పార్టీల నాయకులపై, విద్యార్థి యువజన సంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ […]

RTC strike case

  • కోర్టుకు హాజరైన ప్రజా సంఘాల నేతలు, కార్మికులు

విధాత: 2019 అక్టోబర్ లో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సుమారు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన క్రమంలో వారికి అండగా నిలబడిన అనేకమంది ప్రజాసంఘాల నాయకులపై, ప్రతిపక్ష పార్టీల నాయకులపై, విద్యార్థి యువజన సంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ సమ్మె కాలం నాటి కేసుకు సంబంధించి మంగళవారం కోర్టుకు హాజరైన అనంతరం పందుల సైదులు మీడియాతో మాట్లాడుతూ సమ్మె సమయంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా, వారి న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చకుండా ప్రభుత్వమే పంతానికి పోయి అనేకమంది ఆర్టీసీ కార్మికుల చావులకు కారణమైందన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే 52 రోజులపాటు సమ్మె కొనసాగిందన్నారు.

సమ్మెను విచ్చిన్నం చేయడానికి అనేక కుట్రలకు తెరలేపిన సమయంలో ప్రజాసంఘాల నేతలుగా కార్మికులకు అండగా నిలబడ్డామన్నారు. ఆర్టీసీ కార్మికులకు పూట గడువని సందర్భంలో జోల పట్టుకొని రూపాయ రూపాయ పోగు చేసి 1,30,000 రూపాయలతో సుమారు 68 మంది నిరుపేద ఆర్టీసీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వారి కుటుంబాలను ఆదుకున్నామని గుర్తు చేశారు.

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టగొడితే మేము వారికి ఆనాడు అండగా నిలబడ్డామన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం లో సుమారు 70 మంది ప్రజాసంఘాల, ప్రతిపక్ష పార్టీల, ఆర్టీసీ కార్మిక నేతలపై 5 కేసులు పెట్టారని, వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టిన అక్రమ కేసులన్నింటిని బేషరతుగా వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కేసులకు సంబంధించి కోర్టుకు హజరైన వారి లో ప్రజా సంఘాల నేతలు దండంపల్లి సత్తయ్య, పలస యాదగిరి, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, సామాజిక కార్యకర్త బొంతు రమేష్, యూసబ్ తదితరులు ఉన్నారు.

Updated On 24 May 2023 2:46 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story