స‌మంత క్షేమంగా ఇంట్లో ఉన్నారన్న కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్న అభిమానులు విధాత‌: సినీ నటి సమంత ఆరోగ్యంపై తమిళనాడు మీడియాలో వదంతులు షికార్లు చేశాయి. ఆమె తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరినట్టు పుకార్లు వచ్చాయి. అయితే ఆ వదంతులను నమ్మవద్దని ఆమె మేనేజర్‌ తెలిపారు. సమంత క్షేమంగా ఇంట్లోనే ఉన్నట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. సమంత కొన్నినెలల నుంచి మయోసిటిక్‌ (కండరాల బలహీనత) వ్యాధితో బాధ పడుతున్నది. అయితే ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా […]

  • స‌మంత క్షేమంగా ఇంట్లో ఉన్నారన్న కుటుంబ స‌భ్యులు
  • ఊపిరి పీల్చుకున్న అభిమానులు

విధాత‌: సినీ నటి సమంత ఆరోగ్యంపై తమిళనాడు మీడియాలో వదంతులు షికార్లు చేశాయి. ఆమె తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరినట్టు పుకార్లు వచ్చాయి. అయితే ఆ వదంతులను నమ్మవద్దని ఆమె మేనేజర్‌ తెలిపారు. సమంత క్షేమంగా ఇంట్లోనే ఉన్నట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు.

సమంత కొన్నినెలల నుంచి మయోసిటిక్‌ (కండరాల బలహీనత) వ్యాధితో బాధ పడుతున్నది. అయితే ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె కొంతకాలంగా దూరంగా ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు ఆమె వ్యాధి గురించి వార్తలు రావడంతో ఆందోళనకు గురయ్యారు.

దీనిపై స్పందించిన సమంత ఈవిషయాన్ని పూర్తిగా కోలుకున్న తర్వాత షేరు చేసుకుందామని అనుకున్నారు. కానీ తాను అనుకున్న సమయం కంటే ఎక్కువ టైం పడుతున్నది. అందుకే మీతో ఈ విషయాన్ని షేర్‌ చేసుకుంటున్నట్లు తెలిపారు.

అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, కోలుకుంటున్నాని చెప్పారు. సమంత త్వరగా కోలుకోవాలని హీరోలు, నటులు అంతా సోషల్‌ మీడియా ద్వారా ఆకాంక్షించారు. ఈలోగా మళ్లీ ఆమె ఆరోగ్యంపై తమిళ మీడియాలో వదంతులు రావడంతో అంతా కలవరపడ్డారు. అయితే అవన్నీ వదంతులేనని వాటిని నమ్మవద్దని ఆమె కుటుంబసభ్యులు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated On 24 Nov 2022 7:27 AM GMT
krs

krs

Next Story