హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాదుల కళ్యాణోత్సవాలు కనుల పండగ సాగాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో, మఠంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో, నల్గొండ రామాలయంలో, శ్రీ మత్స గిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, సూర్యాపేటలో గోదా రంగనాథ కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన గోదా రంగ నాథుల […]

హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాదుల కళ్యాణోత్సవాలు కనుల పండగ సాగాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో, మఠంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో, నల్గొండ రామాలయంలో, శ్రీ మత్స గిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, సూర్యాపేటలో గోదా రంగనాథ కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.

సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన గోదా రంగ నాథుల కళ్యాణోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

దేవరకొండ పట్టణంలో నిర్వహించిన గోదా రంగనాయకుల కల్యాణోత్సవంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్.రవీంద్ర కుమార్ లు పాల్గొన్నారు. నల్గొండ రామాలయంలో జరిగిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.

Updated On 14 Jan 2023 3:24 PM GMT
krs

krs

Next Story