విధాత‌, హైద‌రాబాద్: విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్ర నుంచి రిలీవ్ అయిన 84 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. కోర్టు ధిక్కారం కింద విద్యుత్‌శాఖ అధికారులకు జైలుశిక్షే పరిష్కారమని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు చివరి అవకాశం ఇస్తున్నాం. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలి’’ అని సుప్రీం […]

విధాత‌, హైద‌రాబాద్: విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్ర నుంచి రిలీవ్ అయిన 84 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. కోర్టు ధిక్కారం కింద విద్యుత్‌శాఖ అధికారులకు జైలుశిక్షే పరిష్కారమని వ్యాఖ్యానించింది.

కోర్టు ఆదేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు చివరి అవకాశం ఇస్తున్నాం. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలి’’ అని సుప్రీం ఆదేశించింది.

ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని నిర్దేశించింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ నెల 31న మరోసారి సమీక్ష చేయనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.

విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కారు అమలు చేయలేదంటూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated On 11 Oct 2022 2:13 PM GMT
Somu

Somu

Next Story