ఫ్లోరోసిస్ పాపం ఆ రెండు జాతీయ పార్టీలదే విముక్తి చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ విధాత: ఫ్లోరోసిస్ భూతంతో మునుగోడును జీవచ్చంగా మార్చింది కాంగ్రెస్, బీజేపీలేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీలకు ఓట్లు వెయ్యడమంటే మన ఘోరీలను మనం కట్టుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు. అటువంటి ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేసిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే నని ఆయన కొనియాడారు. మునుగోడు నియోజకవర్గ పరిధి నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ […]

  • ఫ్లోరోసిస్ పాపం ఆ రెండు జాతీయ పార్టీలదే
  • విముక్తి చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్

విధాత: ఫ్లోరోసిస్ భూతంతో మునుగోడును జీవచ్చంగా మార్చింది కాంగ్రెస్, బీజేపీలేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీలకు ఓట్లు వెయ్యడమంటే మన ఘోరీలను మనం కట్టుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు. అటువంటి ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేసిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే నని ఆయన కొనియాడారు.

మునుగోడు నియోజకవర్గ పరిధి నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎన్ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, స్థానిక జడ్పీటీసీ ఏవీ రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్ రెడ్డిలతో పాటు మండల పరిధిలోని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లోరోసిస్ కబంధ హాస్టల్లో చిక్కుకున్న మునుగోడును మిషన్ భగీరధ పథకంతో బంధ విముక్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మునుగోడు ప్రజలు జీవచ్చంగా బతకొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.

బీజేపీకీ ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు బిగించాలని ఒప్పుకున్సట్లే అవుతుందన్నారు. వ్యవసాయదారులు ఈ విషయంలో ఆలోచన చెయ్యాలని ఆయాన విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated On 26 Sep 2022 12:47 PM GMT
krs

krs

Next Story