విధాత: భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వీరితో పాటు టీజే ప్రకాశ్(అనంతపురం), తాడివాక రమేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్ నాయుడు(కాపునాడు, ప్రధాన కార్యదర్శి), రామారావు(ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు) కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రయాణం ఎందాకైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది…!
మనకు లక్ష శుద్ధి, సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు #కేసిఆర్ ✊#BRS is for #INDIA – #KCR #BRSParty 💪✊#DeshKiNethaKCR pic.twitter.com/ztyg6PlPJi
— Amberpet Anil Goud (@AnilGoudKTR) January 2, 2023