HomelatestKTR VS BANDI | ట్విట్టర్ వేదికగా KTR.. బండి పంచాంగం పంచ్‌లు.. సెటైర్లు

KTR VS BANDI | ట్విట్టర్ వేదికగా KTR.. బండి పంచాంగం పంచ్‌లు.. సెటైర్లు

విధాత: కేటీఆర్, బండి సంజయ్‌ల‌ మధ్య ఉగాది పంచాంగం నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సాగిన సెటైరికల్ పంచాంగం రాజకీయ పంచ్‌లతో ట్విట్టర్ మోత మోగింది. ప్రధాని మోడీ పాలనపై ఉగాది పంచాంగాన్ని ఆసరాగా చేసుకొని కేటీఆర్ వ్యంగ్యంగా ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.

కేటీఆర్ తన ట్వీట్‌లో ఆదాయం ఆదానికి, వ్యయం జనానికి, బ్యాంకులకు, అవమానం నెహ్రూకు, రాజపూజ్యం గుజరాతీ గుంపునకు.. బబ్రాజీ మానం భజగోవిందం.. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం అని ట్వీట్ చేశారు.

కౌంటర్‌గా బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ పాలనపై పంచాంగం పద్ధతిలోనే సెటైర్లతో కూడిన ట్వీట్‌లతో పంచ్‌లు వేశారు. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం తెలంగాణ రాష్ట్రానికి, అవమానం ఉద్యమ వీరులకు, రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు, పిట్టలదొర.. తుపాకీ చంద్రుల గడీల పంచాయతీ లెక్కతేలుడే తరువాయి అని ట్వీట్ చేశారు.

వారిద్దరి పంచాంగం సెటైర్లు చదివిన జనం కేటీఆర్, బండిలలో ఎవ్వరూ కూడా తగ్గేదే లేదన్నట్లుగా ట్వీట్ల పోరు సాగించి ఆ పార్టీల పొలిటికల్ వార్‌లో మరింత హీట్ పెంచారని అభిప్రాయపడ్డారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular