Kareemnagar: పై అధికారులపై నిర్లక్ష్యం.. ఇద్దరు పోలీసులను సస్పెన్షన్ చేసిన CP సుబ్బారాయుడు
విధాత బ్యూరో, కరీంనగర్: ఓ ప్రైవేటు వ్యవహారంలో తలదూర్చిన హెడ్ కానిస్టేబుల్, విధుల్లో ఉన్న పోలీసు అధికారిని దుర్భాషలాడిన సంఘటనల్లో మరో కానిస్టేబుల్ పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక ప్రైవేటు వ్యవహారంలో జోక్యం చేసుకుని విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామడుగు హెడ్ కానిస్టేబుల్ ఎం.శంకరయ్యపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బారాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. ఏఆర్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో […]
విధాత బ్యూరో, కరీంనగర్: ఓ ప్రైవేటు వ్యవహారంలో తలదూర్చిన హెడ్ కానిస్టేబుల్, విధుల్లో ఉన్న పోలీసు అధికారిని దుర్భాషలాడిన సంఘటనల్లో మరో కానిస్టేబుల్ పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక ప్రైవేటు వ్యవహారంలో జోక్యం చేసుకుని విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామడుగు హెడ్ కానిస్టేబుల్ ఎం.శంకరయ్యపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బారాయుడు సస్పెన్షన్ వేటు వేశారు.
ఏఆర్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్న ఎస్సై ఎం.స్వామిని దుర్భషలాడిన సిటీ ఆర్ముడ్ రిజర్వ్ (సిఏఅర్) విభాగం కానిస్టేబుల్ షబ్బీర్ను కూడా సిపి సస్పెండ్ చేశారు.
తప్పు చేస్తే చర్యలు తప్పవు: సీపీ సుబ్బారాయుడు
అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు క్రమశిక్షణతో మెదులుతూ విధి నిర్వహణ కొనసాగించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.