Uttam Kumar Reddy | జీవిత పర్యంతం ప్రజాసేవలోనే..: MPఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy విధాత: హుజూర్ నగర్, కోదాడ ప్రజల సేవలో జీవిత పర్యంతం పని చేస్తామని పిసిసి మాజీ చీఫ్, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్లారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాళ్ల మల్కాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ రామయ్య స్మారక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు, జాతరలు గ్రామీణ ప్రజల మధ్య సమైక్య భావాన్ని పెంపొందిస్తాయన్నారు. దైవచింతన, […]
Uttam Kumar Reddy
విధాత: హుజూర్ నగర్, కోదాడ ప్రజల సేవలో జీవిత పర్యంతం పని చేస్తామని పిసిసి మాజీ చీఫ్, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్లారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తాళ్ల మల్కాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ రామయ్య స్మారక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు, జాతరలు గ్రామీణ ప్రజల మధ్య సమైక్య భావాన్ని పెంపొందిస్తాయన్నారు.
దైవచింతన, ఆధ్యాత్మికత ఆలోచనలతో పౌర సమాజం క్రమశిక్షణగా జీవనం సాగించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాధనాలుగా ఉంటాయన్నారు. మాజీ సర్పంచ్ రామయ్య స్మారకర్థం గ్రామంలో ప్రజోపకారం కోసం భవనం నిర్మించడం అభినందనీయమన్నారు.