విధాత: ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహా రెడ్డి ఒక్కరోజు గ్యాప్లో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ రెండు చిత్రాలను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండడంతో ఈ రెండు చిత్రాలపై సినీ ప్రేక్షకుల చూపు నిలిచి ఉంది. ఈ రెండు చిత్రాలు మాస్ మసాలా మూవీలుగా మాస్ అభిమానులకు డబుల్ బొనాంజాగా రానున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్క వాల్తేరు వీరయ్య కే కాదు వీరసింహా […]
విధాత: ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహా రెడ్డి ఒక్కరోజు గ్యాప్లో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ రెండు చిత్రాలను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండడంతో ఈ రెండు చిత్రాలపై సినీ ప్రేక్షకుల చూపు నిలిచి ఉంది. ఈ రెండు చిత్రాలు మాస్ మసాలా మూవీలుగా మాస్ అభిమానులకు డబుల్ బొనాంజాగా రానున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఒక్క వాల్తేరు వీరయ్య కే కాదు వీరసింహా రెడ్డి కి కూడా పూనకాలు లోడింగ్ అనేది సరిగ్గా సూట్ అవుతుంది. ఇక బాలయ్య వీర సింహారెడ్డిలో తన డైలాగులతో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు చిరంజీవి, రవితేజతో కలిసి తనదైన టైమింగ్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ కూడా సినిమాల లాగానే ఒక రోజు గ్యాప్లో విడుదలయ్యాయి. రెండు చిత్రాలు ట్రైలర్స్లోనూ కథను ఏమాత్రం రివీల్ చేయలేదు. అయినా కథతో సంబంధం లేదు. ఎందుకంటే ఈ రెండు కేవలం అటు ఇటు గా రొటీన్ సినిమాలే అయినా డిఫరెంట్ మేకింగ్ తో మాస్ జాతర జరిగేలా వస్తున్నాయి.
ఒకప్పుడు గోపీచంద్ మలినేని దగ్గర బాబీ రచయితగా పని చేసేవాడు. ఇప్పుడు అదే గోపీచంద్ మలినేని బాలయ్య వీరసింహారెడ్డికి దర్శకుడు కాగా.. బాబీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యకు దర్శకుడు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి మాస్ జాతర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. బాలయ్యకు వీరసింహారెడ్డి మరో సమరసింహారెడ్డి అవుతుందని అనిపిస్తుండగా, వాల్తేరు వీరయ్యలో ముఠామేస్రి, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ వంటి వింటేజ్ చిరు కనిపించనున్నాడు.
ఈ రోజుల్లో థియేటర్కు ప్రేక్షకులు రావాలంటే బాగా ఎంటర్టైన్ చేయగలగాలి. అందునా స్టార్ హీరోలు అయిఉండాలి. అదే మామూలుగా అయితే ఓటీటీలో చూసేద్దాం.. ఏముందిలే అనుకుంటారు. కానీ రెండు చిత్రాలు ఆ తరహాలో లేవు. వీటిని బిగ్ స్క్రీన్ పై చూస్తేనే మజా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రైలర్లను చూస్తేనే ప్రేక్షకులకు ఆ విషయం అర్థమైపోతోంది.
ఇక ఈ రెండు చిత్రాలలోనూ శృతిహాసన్ హీరోయిన్. ఒకపక్క చిరుతో ఆడుతూ పాడుతూ మరోవైపు బాలయ్యతో చిందులేస్తుంది. కాబట్టి ఆమె అభిమానులు రెండు చిత్రాలను చూసేస్తారు. ఇక ఈ రెండు చిత్రాలకు పోటీగా దిల్ రాజు కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా వారసుడుతో వస్తున్నాడు. అయితే వారసుడు పోస్ట్ పోన్ అయ్యింది అని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని దిల్రాజు క్లారిటీ ఇచ్చాడు.
సో మొత్తానికి ఏ మాత్రం అవకాశం దొరకకుండా వీరయ్య, వీరసింహా రెడ్డిలు బరిలోకి దిగి కోడిపుంజుల్లా సందడి చేయడం.. సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే అవి కూడా సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం. మరి ఈ రెండు చిత్రాలకు ఏ స్థాయి కలెక్షన్లు వస్తాయి? ఈ చిత్రాలలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి.