HomelatestWarangal | టెక్స్ టైల్ పార్క్‌లో 20 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు: మంత్రి ఎర్ర‌బెల్లి

Warangal | టెక్స్ టైల్ పార్క్‌లో 20 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు: మంత్రి ఎర్ర‌బెల్లి

Warangal

  • కుట్టు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 2వేల మందికి త‌క్ష‌ణ‌మే జీవ‌నోపాధి
  • ఈ ఏడాది అక్టోబ‌ర్ లోగా ద‌శ‌ల‌వారీగా నియామ‌కాలు
  • అధికారులు, టెక్స్ టైల్ పార్క్ కంపెనీల‌ ప్ర‌తినిధుల‌తో స‌మీక్షించిన మంత్రి ఎర్ర‌బెల్లి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స‌మీప భ‌విష్య‌త్తులో వ‌రంగ‌ల్ టెక్స్‌టైల్ పార్క్ లో దాదాపు 20వేల మందికి ఉపాధి, ఉద్యోగావ‌కాశాలు ల‌భించే అవ‌కాశాలున్నాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. కుట్టు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 2వేల మందికి త‌క్ష‌ణ‌మే టెక్స్‌టైల్ పార్కులో జీవ‌నోపాధులు ల‌భించ‌నున్నాయ‌న్నారు. ద‌శ‌ల వారీగా ఈ ఏడాది అక్టోబ‌ర్ లోగా అందే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు.

హైద‌రాబాద్ లోని త‌న పేషీలో సంబంధిత అధికారులు, టెక్స్ టైల్ పార్క్ కంపెనీల‌ ప్ర‌తినిధులతో మంత్రి గురువారం స‌మీక్షించారు.

కొత్త‌గా వ‌రంగ‌ల్ లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్‌టైల్ పార్క్ లో అనేక కంపెనీలు వ‌చ్చాయ‌ని, ఆయా కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్రారంభించాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. ఇప్ప‌టికే ఆయా కంపెనీలు ప్రాథ‌మిక స్థాయిలో త‌మకు అవ‌స‌ర‌మైన ఉద్యోగుల‌ను నియ‌మించుకున్నాయ‌ని, మ‌రికొంత మందికి ఉపాధి క‌ల్పించాయ‌ని తెలిపారు. అయితే, కుట్టు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారికి అవ‌కాశాలున్నందున పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్ప‌టికే రెండు విడ‌త‌లుగా వెయ్యి మందికి శిక్ష‌ణ పూర్తి చేశామ‌ని, మ‌రో 2 వేల‌ మందికి శిక్ష‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు.

సెప్టెంబ‌ర్ క‌ల్లా ఈ శిక్ష‌ణ పూర్తి చేస్తామ‌న్నారు. అక్టోబ‌ర్ నెల‌క‌ల్లా కుట్టు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వాళ్ళల్లో అర్హులైన వాళ్లకు వ‌రంగ‌ల్ టెక్స్‌టైల్ పార్క్ లో ద‌శ‌ల వారీగా ఉద్యోగావ‌కాశాలు ల‌భించే విధంగా చేస్తామ‌న్నారు. ఇదే విష‌య‌మై ఆయా కంపెనీల బాధ్యులు, అధికారులతో క‌లిపి స‌మీక్షించామ‌ని మంత్రి తెలిపారు. కుట్టులో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి, ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించేందుకు కంపెనీలు కూడా ముందుకు వ‌చ్చాయ‌ని మంత్రి తెలిపారు.

కుట్టు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాలల యూనిఫార్మ్స్‌, మ‌రోవైపు కుట్టు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారికి ప్ర‌భుత్వ ప‌రంగా ఉపాధి క‌ల్పించేందుకు కృషి చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

ఈ స‌మీక్ష స‌మావేశానికి టిఎస్ ఐఐసీ ఎండి ఈవీ న‌ర్సింహారెడ్డి, టెక్స్ టైల్స్ ఇండ‌స్ట్రీస్ డైరెక్ట‌ర్ మిహిద్‌, టెక్స్ టైల్స్ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వెంక‌టేశం, వ‌రంగ‌ల్ లోని కీ టెక్స్ కంపెనీ ప్ర‌తినిధి మ‌నోజ్ కుమార్‌, యంగ్ వ‌న్ కంపెనీ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్‌ తదిత‌రులు హాజ‌ర‌య్యారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular