Karnataka | బీజేపీలో శాసనసభా పక్ష నేత పోస్టుకు గట్టి పోటీ ముందు వరుసలో బొమ్మై, అశోక, సునీల్, పాటిల్ జూలైలో పూర్తి కానున్న అసెంబ్లీలో విపక్ష నేత ఎంపిక విధాత: సిద్ధరామయ్య మంత్రి వర్గంలో ఖాళీల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుండగా, మరోవైపు బీజేపీ సైతం ప్రతిపక్ష నేత (BJP opposition leader) ఎంపికలో బిజీబిజీగా ఉన్నది. విపక్ష నేత పదవి కోసం బీజేపీ రాష్ట్ర శాఖలో తీవ్రపోటీ నెలకొన్నది. కొత్తగా ఎన్నికైన […]
Karnataka |
- బీజేపీలో శాసనసభా పక్ష నేత పోస్టుకు గట్టి పోటీ
- ముందు వరుసలో బొమ్మై, అశోక, సునీల్, పాటిల్
- జూలైలో పూర్తి కానున్న అసెంబ్లీలో విపక్ష నేత ఎంపిక
విధాత: సిద్ధరామయ్య మంత్రి వర్గంలో ఖాళీల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుండగా, మరోవైపు బీజేపీ సైతం ప్రతిపక్ష నేత (BJP opposition leader) ఎంపికలో బిజీబిజీగా ఉన్నది. విపక్ష నేత పదవి కోసం బీజేపీ రాష్ట్ర శాఖలో తీవ్రపోటీ నెలకొన్నది. కొత్తగా ఎన్నికైన నూతన ఎమ్మెల్యేలతో పార్టీ హైకమాండ్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జూలైలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. ప్రతిపక్ష నేత పదవికి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ డీసీఎం ఆర్ అశోక, మాజీ మంత్రి సునీల్కుమార్, సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ పోటీ పడుతున్నారు.
జాగ్రత్తగా బేరీజు వేస్తున్న బీజేపీ హైకమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులను ఎత్తిచూపడంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర కీలకం కాబట్టి, ఆ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు హైకమాండ్ జాగ్రత్తగా బేరీజు వేస్తున్నదని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్కు అనేక మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు.
వారు ఏ సమస్యపైనైనా ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవటానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, మా పార్టీ ఖచ్చితంగా సమానంగా తెలివిగల, ప్రభుత్వాన్ని తీయగల సామర్థ్యం ఉన్న నేతను ఎన్నుకుంటుంది ” అని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు.
కర్ణాటకకు పరిశీలకుల బృందం!
శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే ముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించేందుకు పార్టీ హైకమాండ్ పరిశీలకుల బృందాన్ని కర్ణాటకకు పంపుతుందని బీజేపీ నేత అశోక వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్ స్థానంలో కొత్త వారికి చోటు కల్పిస్తారా అనే అంశాన్ని సైతం పార్టీ తేల్చలేదు.
మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై సమీక్షించేందుకు కాషాయ పార్టీ ఇటీవల సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి యత్నాల్ (లింగాయత్), శోభా కరంద్లాజే, సిటి రవి (ఇద్దరూ వొక్కలిగాలు), వీ సోమన్న (లింగాయత్), సునీల్ కుమార్ (ఈడిగ) పేర్లు వినిపించాయి