విధాత‌: యాసంగి పంటలు వేసే సమయం ఆస‌న్న‌మైంది. రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యాసంగి పంటలకు ప్రాజెక్టుల కింద పంటల సాగుకు స‌కాలంలో నీటి విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ నేడు నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేర‌కు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ అధ్యక్షత‌న రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక-యాజమాన్య కమిటీ సమావేశం జరుగనున్న‌ది. ఈ ఏడాది వ‌ర్షాలు అధికంగా కురిసిన విష‌యం తెలిసిందే. దీంతో గోదావ‌రి, కృష్ణా న‌దుల‌తో పాటు ఉప‌న‌దులు, చిన్న పెద్ద చెరువులు, […]

విధాత‌: యాసంగి పంటలు వేసే సమయం ఆస‌న్న‌మైంది. రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యాసంగి పంటలకు ప్రాజెక్టుల కింద పంటల సాగుకు స‌కాలంలో నీటి విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ నేడు నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేర‌కు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ అధ్యక్షత‌న రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక-యాజమాన్య కమిటీ సమావేశం జరుగనున్న‌ది.

ఈ ఏడాది వ‌ర్షాలు అధికంగా కురిసిన విష‌యం తెలిసిందే. దీంతో గోదావ‌రి, కృష్ణా న‌దుల‌తో పాటు ఉప‌న‌దులు, చిన్న పెద్ద చెరువులు, కుంట‌లు, వాగులు పొంగి పొర్లిపోయాయి. అంతేకాదు భూగ‌ర్భ‌జ‌లాలు కూడా పెరిగాయి. పంట‌ల‌కు స‌మృద్ధిగా నీరు ల‌భిస్తుండ‌డంతో రైతులు మురిసిపోతున్నారు.

Updated On 22 Nov 2022 8:29 AM GMT
krs

krs

Next Story