విధాత: ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరోసారి కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో బుధవారం తాజా దాడులు జరిపింది.
జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది.
హబ్బా కాదల్ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న షా ఫైజల్ అనే వ్యక్తిని ఎన్ఐఏ నిర్బంధం లోకి తీసుకుని శ్రీనగర్లోని షహీద్ జుని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లింది.
అనంతరం, స్కిమ్స్ (ఎస్కేఐఎంఎస్) సౌర ఆసుపత్రిపై దాడి జరిపి ఇర్షాద్ అహ్మద్ ఎలాహి అనే 24 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుంది.