మోదీ ఫోటోలకు పూల దండలు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
విధాత : భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వారికే పూలదండాలు వేసి నివాళులర్పించడం చూశాం. కానీ ఇప్పుడు బతికున్న మనషులకు కూడా పూలదండలు వేసి అభాసు పాలవుతున్నారు. అదేదో సాదాసీదా వ్యక్తి ఫోటోకు దండాలు వేయలేదు.. ఏకంగా ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోకే దండాలు వేసి దండం పెడుతున్నారు. పుష్పాంజలి ఘటిస్తున్నారు. తాజాగా ఓ కేంద్ర మంత్రి మోదీ ఫోటోలకు దండాలు వేసి […]
విధాత : భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వారికే పూలదండాలు వేసి నివాళులర్పించడం చూశాం. కానీ ఇప్పుడు బతికున్న మనషులకు కూడా పూలదండలు వేసి అభాసు పాలవుతున్నారు.
అదేదో సాదాసీదా వ్యక్తి ఫోటోకు దండాలు వేయలేదు.. ఏకంగా ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోకే దండాలు వేసి దండం పెడుతున్నారు. పుష్పాంజలి ఘటిస్తున్నారు. తాజాగా ఓ కేంద్ర మంత్రి మోదీ ఫోటోలకు దండాలు వేసి దండం పెట్టారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఫూల్స్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. కనీస అవగాహన లేకుండా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీ నాయకుల అనుచిత ప్రవర్తనపై నిప్పులు చెరుగుతున్నారు.
కొద్దిరోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రేషన్ షాపుల్లో మోదీ ఫోటోలు ఎందుకు పెట్టలేదని ఓ కలెక్టర్పై రుసరుసలాడిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు మోదీ ఫోటోల గోల.. ఇప్పుడేమో మోదీ ఫోటోలకు దండాలు వేయాలంటూ మరో గోల సృష్టించారంటూ నెటిజన్లు ఆ పార్టీ నాయకులను ఏకిపారేస్తున్నారు.