విధాత,అనంతపురం: తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం, .చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎవరినైనా ఎదిరిస్తా. ఎంత దూరమైనా వెళ్తా అని తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ కండువా వేసుకున్నా వేసుకోకపోయినా మోసం చేయనని..గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పుణ్యంతో మున్సిపల్ చైర్మన్ అయ్యాని, చంద్రబాబు పుణ్యంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు చెప్పారు. ఫ్యాక్షన్ లేదని ప్రజలతో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా గెలవాలన్నారు. […]

విధాత,అనంతపురం: తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం, .చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎవరినైనా ఎదిరిస్తా. ఎంత దూరమైనా వెళ్తా అని తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ కండువా వేసుకున్నా వేసుకోకపోయినా మోసం చేయనని..గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పుణ్యంతో మున్సిపల్ చైర్మన్ అయ్యాని, చంద్రబాబు పుణ్యంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు చెప్పారు. ఫ్యాక్షన్ లేదని ప్రజలతో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా గెలవాలన్నారు. పార్టీని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆయన త్వరలో 10 వేల మందితో సమావేశం నిర్వహించి అధినేత చంద్రబాబును ఆహ్వానిస్తామని తెలిపారు.

పదవి ముఖ్యం కాదని..పార్టీ కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ‘‘నన్ను సస్పెండ్ చేసినా…చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కోసం పని చేస్తా’’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడమే తమ ధ్యేయమన్నారు. ఒక్కసారి జైలుకు పోయి వస్తే ఏమవుతుందని… భయం పెట్టుకోవాలి కానీ జైలుకు పంపడం కాదన్నారు. చిన్న పోస్టింగ్ పెడితే జైలుకు పంపిస్తున్నారని… ఈ ఎమ్మెల్యే తనను చెప్పుతో కొట్టి ఊరు విడిపిస్తా అన్నాడని ఆయన తెలిపారు. విశాఖలో ముఖ్యమంత్రి ఫోటోని చెప్పుతో కొట్టిన సంఘటన గుర్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వంపై రాష్ట్రంలో వ్యతిరేకత మొదలైందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవారిని వెంటబెట్టుకుని పల్లెపల్లెకూ తిరుగుతామని జేసీ ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించారు.

Updated On 16 July 2021 7:47 AM GMT
Venkat

Venkat

Next Story