విధాత‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క టీకా తయారీ కంపెనీ ఐనా వచ్చిందా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ పుట్టడానికి ముందు నుంచే రాష్ట్రంలో, హైదరాబాద్‌లో పలు ఫార్మా కంపెనీలున్నాయన్న సంగతి గుర్తుంచుకోవాల‌న్నారు. ‘కేసీఆర్‌ వచ్చాకే తెలంగాణ ప్రజలు భోజనం చేస్తున్నారు. పోలియో టీకాలు వేసుకుంటున్నారు అన్న విధంగా టీఆర్‌ఎస్‌ వ్యవహారం ఉంది’అని రఘునందన్‌ ఎద్దేవాచేశారు. అసలు సీఎం కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన […]

విధాత‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క టీకా తయారీ కంపెనీ ఐనా వచ్చిందా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ పుట్టడానికి ముందు నుంచే రాష్ట్రంలో, హైదరాబాద్‌లో పలు ఫార్మా కంపెనీలున్నాయన్న సంగతి గుర్తుంచుకోవాల‌న్నారు. ‘కేసీఆర్‌ వచ్చాకే తెలంగాణ ప్రజలు భోజనం చేస్తున్నారు. పోలియో టీకాలు వేసుకుంటున్నారు అన్న విధంగా టీఆర్‌ఎస్‌ వ్యవహారం ఉంది’అని రఘునందన్‌ ఎద్దేవాచేశారు. అసలు సీఎం కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణను అవమానపరిచినట్లు అని కేటీఆర్‌ మాట్లాడడడం సరైందికాదన్నారు. ఫార్మాసిటీకి సంబంధించి ముచ్చర్లలో పది వేల ఎకరాలు సేకరించినప్పుడు రాని ఇబ్బందులు మిగిలిన రెండు వేల ఎకరాలకు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. ఐటీఐఆర్‌ రీజియన్‌ని ఎందుకు ఏర్పాటు చేయలేదో గత యూపీఏ ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. పరిశ్రమల మంత్రిగా రేయాన్‌ ఫ్యాక్టరీ, నిజాంషుగర్, అజంజాహిమిల్, ప్రాగా టూల్స్, ఆల్విన్‌ కంపెనీలను తెరిపించే సంగతేంటో కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్‌చేశారు. సిరిసిల్లకు ఎన్ని లక్షల బతుకమ్మ చీరలకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారో, దుబ్బాక నుంచి ఎన్ని తెచ్చారో చెప్పాలని రఘునందన్‌ డిమాండ్‌చేశారు.

Updated On 29 Sep 2021 8:15 AM GMT
subbareddy

subbareddy

Next Story