- రూ.80లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
విధాత: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతుందని భాస్కర్ రావు అన్నారు. గురువారం మాడ్గులపల్లి మండల పరిధిలోని ఇస్కబావిగుడెం, తోపుచర్ల, కుక్కడం, చిరుమర్తి గ్రామాలకు స్పెషల్ డెవెలప్ మెంట్ ఫండ్ గ్రాంటు ద్వారా గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం 80లక్షల రూపాయల నిధులతో నూతన సి.సి రోడ్ల నిర్మాణ పనులకు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అంతర్గత, అనుసంధాన రోడ్ల పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మండల పార్టీ అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, పాక్స్ చైర్మన్ జేర్రిపోతుల శ్రీరాములు గౌడ్, సీనియర్ నాయకుడు పొనుగోటి చొక్కారావు, మండల కో ఆప్షన్ సభ్యుడు షైక్ మౌలాలి, సర్పంచ్లు అల్గుబెల్లి గోవిందరెడ్డి, నిమ్మల గోవిందమ్మ, మారుతి వెంకట్ రెడ్డి, శ్రీశైలం, మంగా యాదయ్య, సైదులు, ఎం.పీ.టీ.సీ కత్తి కనకా రెడ్డి, కళింగ రెడ్డి, నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, యతం నరేందర్ రెడ్డి, కర్ర ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ డిఈ వెంకటేశ్వర్ రావు, ఎంపిడిఓ మేకల నాగయ్య, కూరేళ్ళ వెంకట చారి, ఎరేడ్ల అంజి రెడ్డి, నకిరేకంటి శ్రీను, గోపాల్ రెడ్డి, శర్మ, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.