ఎన్నికల అభ్యర్థుల బ్యాలెట్ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ముద్రించారని ఆరోపిస్తూ ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఆందోళనకు దిగారు

  • అధికారుల తీరుపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన
  • ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క అర్ధరాత్రి ఆందోళన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల అభ్యర్థుల బ్యాలెట్ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ముద్రించారని ఆరోపిస్తూ ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఆందోళనకు దిగారు. సోమవారం అర్ధరాత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విజయ భాస్కర్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు ముద్రించారు.


అయితే ఎన్నికల అధికారుల తీరుపై ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అధికార బీఆర్ఎస్ పార్టీ కుట్రగా ఆమె ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ విషయంపై సీతక్కను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన ఫొటో చిన్నదిగా ముద్రించడంపై అర్ధరాత్రి 1.30 తర్వాత కూడా సీతక్క ఆందోళన కొనసాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండటంతో ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో బ్యాలెట్ పేపర్ లో సీతక్క ఫొటో చిన్నదిగా ముద్రించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆర్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించినప్పటికీ.. స్పష్టమైన హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామన్నారు. రిటర్నింగ్‌ అధికారి సూచన మేరకు నాయకులు సీతక్క మరో ఫొటోను తీసుకొచ్చి ఎన్నికల అధికారులకు ఇచ్చారు.

Updated On
Somu

Somu

Next Story