అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లే అయ్యప్ప దీక్షాపరుల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది.

విధాత‌: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లే అయ్యప్ప దీక్షాపరుల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. శబరిమల క్షేత్రానికి వెళ్లేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 22 రైళ్లను నడుపబోతున్నట్లు పేర్కొంది.



సికింద్రాబాద్‌-కొల్లం, నర్సాపూర్‌-కొట్టాయం, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్‌-కొట్టాయం, కొల్లం-సికింద్రాబాద్‌ ర్గాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఆయా రైళ్లలో జనరల్‌, స్లీపర్‌, ఏసీ కోచ్‌లుంటాయని.. ఆయా రైలు సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

Updated On 20 Nov 2023 12:21 PM GMT
Somu

Somu

Next Story