దళిత బంధు హుజూరాబాద్ ప్రజలకు‌ ఇవ్వద్దంటారా…బీజేపీ వైఖరి ఏంటి.బండి సంజయ్ సమాధానం చెప్పాలి.పెట్రోల్, డిజీల్ గ్యాస్ ధరలు పెంచినం దుకు బీజేపీకి ఓటు వేయాలా.. ?ఈటలకు పార్టీలో ఎక్కువే ఇచ్చింది.హుజూరాబాద్ ఎన్నికల్లో తెరాస‌ గెలుపు పక్కా.బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలని తెరాస‌సోషల్ మీడియా వారి యర్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపు. సిద్దిపేటలో తెరాస సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశం.మంత్రి హరీశ్ రావు కామెంట్స్. విధాత:బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది.గోబెల్స్ […]

దళిత బంధు హుజూరాబాద్ ప్రజలకు‌ ఇవ్వద్దంటారా…బీజేపీ వైఖరి ఏంటి.
బండి సంజయ్ సమాధానం చెప్పాలి.
పెట్రోల్, డిజీల్ గ్యాస్ ధరలు పెంచినం దుకు బీజేపీకి ఓటు వేయాలా.. ?
ఈటలకు పార్టీలో ఎక్కువే ఇచ్చింది.
హుజూరాబాద్ ఎన్నికల్లో తెరాస‌ గెలుపు పక్కా.బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలని తెరాస‌సోషల్ మీడియా వారి యర్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపు. సిద్దిపేటలో తెరాస సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశం.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్.

విధాత:బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది.గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అబద్ద ప్రచారం.‌గొెబెల్స్ బ్రతికి ఉంటే బీజేపీ ప్రచార తీరు చూసి ఉరి వేసుకుంటాడు.2014 లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాయి.తెరాస రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబరు వన్ గా నిలిపింది.మరో వైపు మన దేశ జీడీపీ బంగ్లాదేశ్ కన్నా తక్కువగా పడిపోయోలా బీజేపీ పాలన సాగింది.హుజూరాబాద్ లో అసలు బీజేపీ వాళ్లు ఎం చెప్పి ఓట్లు అడుగుతారు.ఏడాదికి రెండు కోట్ల‌ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వ నందుకు ఓట్లు అడుగుతారా ..పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగు తారా..గత ఏడాది వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ కిరాయి ఎకరానికి 3 వేలు ఉంటే, నేడు ‌ఎకరానికి ఐదు వేలు అడు గుతున్నారు. డిజీల్ ధర అరవై రూపా యల నుండి‌ నూటా ఆరు రూపాయల కు పెంచి రైతుల నడ్డి విరిచినందుకు ఓట్లు అడుగుతారా.. కేసీఆర్ ఐదు వేలు రైతు బందు కింద రైతులకు ఇస్తే డిజీల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం 2500 రూపాయలు ఇంకో చెత్తో తీసుకుంటోం ది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రయివేటీ కరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతుంది.

మళ్లీ సోషల్ మీడియా లో మేం ఉద్యోగా లు ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణ లు చేస్తోంది. బీసీ సంక్షేమ శాఖ పెట్టమ ని కోరితే ప్రభుత్వ రంగ సంస్థలని అ మ్మెందుకు డిజిన్విస్టమెంట్ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీని వల్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేపడుతోంది. తెరాస‌ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ వంటి సంస్థ లకు మూడు వేల కోోట్లు ఇచ్చి ఉద్యో గులను కాపాడుకుంటూ ఉంది.ఇప్పటికే లక్షా 30 వేల‌ఉద్యోగాలను భర్తీ చేశాం. త్వరలో మరో 50 నుు చి 60‌వేల ఉద్యో గాలు భర్తీ చేస్తాం. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి. గెలిస్తే ఆయనకు మాత్రమే లా భం.. అక్కడి అభివృద్ధి కుంటుపడు తుంది. వ్యక్తి ప్రయోజనమా… హుజూ రాబాద్ ప్రజల ప్రయోజనమా..అన్న చర్చ పెట్టాలి.దళిత బందు హుజూ రాబాద్ లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పరిగ ఏరుకున్నట్లు అవసరం లేదన్నారు. బీజేపీ వైఖరేంటో బండి సంజయ్ ప్రకటించాలి.

హుజూరాబాద్లో ఓట్లు అడిగే ముందు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలి.రైతు బందును హుజూరాబాద్ లో మొట్టమొదటి గా ప్రారంభిస్తే ఆనాడు ఈటల చప్పట్లు కొట్టారు.అదే సెంటిమెంట్ తో హుజూరాబాద్ లో దళిత బందు ప్రారంభిస్తామని సీఎంగారు ప్రకటిస్తే గుండెలు బాదుకుంటున్నారు.కొద్ది మంది బీజేపీ నేతలు‌ ఎన్నికల‌సంఘానికి ఫిర్యాదు చేశారు.

తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని‌ కేంద్ర ఎన్నికల‌ సంఘం పై ఒత్తిడి తెస్తున్నారు. దీని‌వల్ల దళిత బంధు పథకం ఆగిపోతుందని వీరి ఆశ.రైతుబంధు, దళిత బంధు దండగ అనే బీజేపీ నేత ఈటల కావాలా…తెరాస కావాలా అన్న చర్చ పెట్టాలి.

దళిత‌బంధు పెడితే ఎన్నికల‌కోసం అంటున్నారు. గత మార్చి నెలలో బడ్జెట్ లోనే దళితుల అభ్యున్నతికి 1200. కోట్లతో దళిత్ ఎంపవర్ మెంట్ స్కీం‌ ను ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో నేను ప్రకటించాను.దళితులు బాగుపడటం బీజేపీ కు ఇష్టం లేదు.గడియారాలు, కుట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను ఈటల రాజేందర్ పంచుతూ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.అందుకే ప్రజలు సీఎం కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకుని, ఆ గడియారాలను పగుల‌గొడుతున్నారు.తెరాస గెలుపు పక్కా..భారీ మెజారిటీతో గెలుపుకు కృషి‌ చెద్దాం.సోషల్ వారియర్లు నేటి తరం‌ కార్యకర్తలు.రానున్ను రోజుల్లో పార్టీలో మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.బీజేపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాన్ని అడ్డుకుందాం.ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను‌ ప్రజల్లోకి తీసుకెళ్దాం

ఈ కార్యక్రమం లో విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ , గెల్లు శ్రీనివాస్ , కౌశిక్ రెడ్డి , సతీష్ ,దినేష్ , జగన్మోహన్ రావు , వివిధ జిల్లాల నుండి వచ్చిన టి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు..

Updated On 9 Aug 2021 7:58 AM GMT
Venkat

Venkat

Next Story