ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు.. లవ్ అగర్వాల్
విధాత: దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్ లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 13 రాష్ట్రాల్లో రోజుకు వంద మంది చనిపోతున్నారని తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కేసులు ఎక్కువ వచ్చాయని వివరించారు. బెంగళూరులో పాజిటివిటీ రేటు […]
విధాత: దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్ లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 13 రాష్ట్రాల్లో రోజుకు వంద మంది చనిపోతున్నారని తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కేసులు ఎక్కువ వచ్చాయని వివరించారు. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50శాతానికి పైగా ఉందని వివరించారు. ఒక్క బెంగళూరులోనే వారంలో లక్షన్నర కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.